Dec: 31/24 “నేటి భారతం’
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
ఒక్కో ఒక్కోప్రజా ప్రతినిధి ఒక్కో విధంగా ఆలోచిస్తూ,ఆచరించడం సహజం. గతంలో పలువురు ప్రజా ప్రతినిధులు వారి వద్దకు వచ్చే అధికారులు,నాయకుల ను పూల బొకే లకు బదులు మొక్కలను, శాలువాలకు బదులు కాటన్ టవల్ ను తీసుకురావాలని చెప్పడం, అలాగే అధికారులు,నాయకులు తేవడం జరిగింది. కాని అ మొక్కలను ఎక్కడ నాటారో, అ ‘టవల్లను’ఎవరికిచ్చారో తెలియదు.కాని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ k. K మహేందర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆలోచింపజెస్తుంది. నేటి పరిస్థితుల్లో పేద, మధ్య తరగతి ప్రజలకు నోట్ బుక్ లు కొనడం ఎంత ఇబ్బందిగా మారిందో అందరికి తెలుసు. ఇలాంటి సందర్భంలో k. K వద్దకు వచ్చే వారు తీసుకు వచ్చే బుక్కులు,పెన్నులను,వివిధ పాఠశాలల్లో పంచితే, విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.











Leave a Reply