Category: తెలంగాణ,రాజన్న సిరిసిల్లా.
-

కమిషన్ల కొరకు నాటారు…? కరెంటు కొరకు నరుకుతునారు….?
మే 16/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. కమిషన్ల కొరకు నాటారు సిరిసిల్ల మున్సిపాలిటీ వారు, వాటిని కరెంట్ పేరుతో నరుకుతున్నారు విద్యుత్ సంస్థ అధికారులని ప్రజలు పట్టణంలో చర్చించుకుంటున్నారు.అఖండం, భ్రమండం, అద్భుతం అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి లహరి ఫంక్షన్ హల్ వరకు, అంబేద్కర్ చౌక్ నుండి రగుడు జంక్షన్ వరకు,అంబేద్కర్ చౌక్ నుండి పెద్దురు స్టేజి వరకు.…
-

సర్కార్ దవాఖానలో… సంపు నీళ్లు తాగిస్తున్నారు.
మే 16/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సర్కార్ దవాఖానలో నాణ్యమైన వైద్యం అందించకున్న కనీసం స్వచ్ఛమైన నీరు అందించడంలో దవాఖాన అధికారులు మొద్దూ నిద్ర పోతున్నారు. మనిషికి జబ్బు చేస్తే స్వచ్ఛమైన నీరు త్రాగుమని సూచనలు చేసే వైద్యులు,రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతీయ వైద్య శాలలో మాత్రం రోగులకు సంపూ నీరు తాగిస్తున్నారు.ప్రభుత్వం పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం, మందులు, వసతులు అందించడానికి నిధులు…
-

గీతా పఠనంలో సిరిసిల్ల మహిళ స్వర్ణ పతకం.
మే 11/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. భగవత్ గీతా పఠనంలో సిరిసిల్ల మహిళ స్వర్ణ పతకం గెలుచుకుంది.భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేయడం ద్వారా బంగారు పతకాలు సాధించడం ఒక గొప్ప ఆధ్యాత్మిక మేధోపరమైన సాధనమని వక్తలు అభిప్రాయపడుతున్నారు. శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూర్ లో నిర్వహించిన పోటీల్లో సంపూర్ణ భగవద్గీత (18 అధ్యాయాలు, 700 శ్లోకాలు) కంఠస్థం చేసిన వారికి బంగారు…
-

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
*మైనర్ బాలికలకు రక్షణగా ఫోక్సో చట్టం. *అనాధ పిల్లలకు ప్రభుత్వం చేయూత నిస్తుంది. *చట్ట బద్ధమైన దత్తత అన్ని విధాలా మంచిది. ఏప్రిల్ 27/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. 14సo -18సం రాల మధ్య వయస్సు గల పిల్లలు చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా (డీసీపీఓ) డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కవిత అన్నారు.సోమవారం సిరిసిల్ల పట్టణ కాలేజీ గ్రౌండ్…
-

తెలంగాణ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ కు సన్మానం.
ఏప్రిల్ 25/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. తెలంగాణ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ సాంబశివ రెడ్డి ని సిరిసిల్ల జిల్లా ప్రాసిక్యూటర్లు శనివారం కరీంనగర్లో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి స్మారక చిహ్నం అందజేశారు.అనంతరం ప్రాసిక్యూషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లక్ష్మీప్రసాద్, సతీష్, సందీప్, విక్రాంత్, శ్రీనివాస్,…
-

సరిదిద్దాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే.
ఏప్రిల్ 17/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఉందని ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మన్ మాదిగ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ,రాష్ట్ర జనాభాలో మాదిగలు 10 నుండి 11 శాతం ఉంటారని మా నాయకుడు మందకృష్ణ…
-

‘గజ్జెల’కు దళిత రత్న రాష్ట్ర అవార్డ్.
ఏప్రిల్ 15/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. భారత రాష్ట్ర సమితి(BRS )విద్యార్థి విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జెల దేవరాజ్ కు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో “దళిత రత్న అవార్డ్’ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిన అందజేసింది.తెలంగాణ రాష్ట్ర సాధన,దళితుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేసిన గజ్జెల సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ అవార్డ్…
-

కళ తప్పుతోందా…….తప్పిస్తున్నారా….?
*జిల్లాలోని దళితుల సమీకరణకు, వారి వెతలను వెల్లడించుకోవడానికి వేదికగా ఉండే జయంతి కార్యక్రమం. *ఊరేగింపులు, డప్పు చప్పులతో అంబరానంటే సంబరం నాడు *చలి చప్పుడు లేకుండా సమాప్తం చేస్తున్న సందర్భం నేడు. * అంబేద్కర్ వాదులు అస్తిత్వం కోల్పోతున్నారా…? * రాజకీయ పార్టీల ప్రలోభాలే కారణమని భావిస్తున్న “నేటి భారతం’. ఏప్రిల్ 14/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఏప్రిల్ 14 మంగళవారo రోజున సిరిసిల్ల…
-

నాటింది…. నరకడానికేనా….?
ఏప్రిల్ 13/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. పర్యావరణ సమతుల్యం కోసం ప్రభుత్వం నాటిన మొక్కలు నరకడానికేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని, పోతిరెడ్డి పల్లె గ్రామపంచాయతీలో ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ద్వారా నాటిన మొక్కలను కొందరు దుండగులు నరికేశారు. ఈ మొక్కలను గ్రామపంచాయతీ ఉపాధి హామీ పథకం ద్వారా ట్యాంకర్లతో నీరును పోస్తూ పెంచి పెద్ద చేసింది.కానీ…
-

స్టేట్ 2వ ర్యాంకర్ సిరిసిల్ల అమ్మాయి.
ఏప్రిల్ 12/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఈరోజు వెలువడిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్ష ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల పట్టణానికి చెందిన గుంటుక శృతి స్టేట్ రెండవ ర్యాంక్ సాధించింది. తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గురుకుల కళాశాలలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్న శృతి తండ్రి నేత కార్మికుడు, తల్లి పాఠశాలలో స్వీపర్.ఎంపీసీ రెండవ సంవత్సరంలో 992 మార్కు సాధించి, ఎంపీసీ…
-

అర్ధరాత్రి…. అక్రమ నిర్మాణాలు …?
• అధికారులను అడగండoటున్న వార్డు కౌన్సిలర్. • పిర్యాదు అందితేనే స్పందిస్తామానేలా ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులు. • వార్డ్ లో వార్డ్ ఆఫీసర్లు చేస్తున్నదేమిటి…? ఏప్రిల్ 9/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ పట్టణ పరిధిలో అర్ధరాత్రి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వివరాల్లోకి వెళ్ళితే సిరిసిల్ల మున్సిపల్ 26 వార్డ్ లో రాత్రికి రాత్రే అక్రమానిర్మాణాలు నిర్మిస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన కౌన్సిలర్,…
-

కారు దిగబోతున్న పలువురు కౌన్సిలర్లు…!
ఏప్రిల్ 7/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్లో BRS కౌన్సిలర్స్ గా కొనసాగుతున్న పలువురు కౌన్సిలర్లు కారు దిగబోతున్నట్లు సమాచారం. వారంతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో టచ్ లో ఉన్నట్లు పట్టణంలో చర్చ జరుగుతుంది.కౌన్సిలర్ ఎన్నికలు ముగిసిన తరువాత క్యాంపుకు వెళ్లి వచ్చిన తరువాత, BRS పార్టీలోని కీలక నాయకుని ప్రవర్తన, వ్యవహార తీరు పట్ల కారు దిగనున్న…
-

మళ్ళీ అధికారం లోకి వచ్చేది BRS పార్టీయే.!
ఏప్రిల్ 5/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మళ్ళీ అధికారం లోకి వచ్చేది BRS పార్టీయేనని, BRS నాయకులపై దాడులకు పాల్పడుతున్న వారు గుర్తుంచుకోవాలని సిరిసిల్ల పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్ అన్నారు.గజ్వెల్ లోని కెసిఆర్ (MLA ) క్యాంపు ఆఫీస్ పై దాడి చేయడాన్ని ఖండిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా సుంకపాక మనోజ్ కుమార్ మాట్లాడుతూ …
-

NCC తో క్రమశిక్షణ.. దేశభక్తి.. ఉద్యోగ అవకాశాలు…?
ఏప్రిల్ 4/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. NCC తో క్రమశిక్షణ.. దేశభక్తి.. ఉద్యోగ అవకాశాలు ఉంటాయని కేర్ టేకర్ సంతోష్ రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శివనగర్లోని కుసుమరామయ్య ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ (NCC) పరేడ్, తరగతుల ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఎన్సీసీ(NCC) సిబ్బంది, కేర్టేకింగ్ ఆఫీసర్ (CTO) ఆధ్వర్యంలో క్యాడెట్లకు డ్రిల్స్, పరేడ్ విధానాలు, ప్రాథమిక శిక్షణను అందించారు. శిక్షణలో విద్యార్థులు…
-

సులభ్ “శుభ్రంగా లేదు…?
ఏప్రిల్ 2/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంనీ మార్కెట్ లో గల సులభ్ కాంప్లెక్స్ శుభ్రంగా లేదని, కంపుకొడుతుందని చిరు వ్యాపారాలు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రజాధనం పుట్నాల ఖర్చుచేస్తున్న మున్సిపల్ పాలకవర్గం పారిశుధ్య నిర్వహణలో ఫెయిల్ అయ్యిందని ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.గత వారం రోజుల నుండి మార్కెట్ లో సులభ్ కాంప్లెక్స్ ను ఎవ్వరు నిర్వహించడం లేదని,…
-

జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేయాలి.
మార్చి 28/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాదిగ సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మాదిగ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ…
-

తినొద్దని తీర్మానించుకుంటే సరిపోద్ది..!
*నెలకు 2సార్లు తింటే సరిపోద్దనే భావనలో ప్రజలు. * ప్రత్యామ్నాయంగా చికెన్, చేపలు తిసుకుంటే సరిపోతుందంటున్న వైద్యులు. • ధరల పెరుగుదల పై నేటికీ స్పందించని సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్, ఛైర్పర్సన్ లు. మార్చి 19/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మార్కెట్లో మటన్ ధర రోజు రోజు కి ఆకాశాన్ని అంటుతుంటే, పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతుండగా, నెలలో 4 సార్లు(ఆదివారం)…
-

అమ్ముకున్నవి అక్షరాలా 165 కోట్లు….?
మార్చి 17/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. అవును మీరు చదువుతున్నది నిజమే.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలువురు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ‘బియ్యం’ సొమ్ము 165 కోట్లు.165కోట్లు ఏందీ అనుకుంటున్నారా..?అవును మీరు చదువుతున్నది నిజమే,ప్రతి సీసన్ లో రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసిన లక్షల క్వింటాళ్ల వరి దాన్యాన్ని, రైస్ మిల్లర్లకు అందిస్తే, మిల్లర్లు వాటిని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అందించాలి. ఆ…
-

అమ్ముకున్న అడిగే వారు లేరు….?
* కోట్ల విలువ చేసే ప్రభుత్వ ధాన్యం పక్కదారి. * అమ్ముకున్నట్లు సివిల్ సప్లై అధికారులు ధృవీకరించిన చర్యలు శూన్యం. • రైస్ మిల్లర్ల వ్యవహారంలో అధికారుల తీరు పై అనుమానాలు. • ప్రభుత్వ సోమ్ము రాబడతారా..?చూసి చూడనట్టు వదిలేస్తారా…? • అరెస్ట్ లు కాదు… ఆస్తులు అటాచ్ చేయాలి. మార్చి 15/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం రైస్…
-

సెస్ ఉద్యోగుల విధుల బహిష్కరణ.
మార్చి 11/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సెస్ ఉద్యోగ, కార్మికులు వారి సమస్యలపై 72 గంటల విధుల బహిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ అన్ని క్యాడర్లలో గల ఉద్యోగులకు తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్ (VEW)గా విధులు నిర్వహిస్తున్న సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఇచ్చిన కారుణ్య నియామకాలను ఇప్పటివరకు రెగ్యులరైజ్ చేయలేదని, వాటిని వెంటనే…
-

‘ప్లాస్టిక్’ ను పాలక వర్గం పట్టించుకునేనా..?
మార్చి 10/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్లో కొత్తగా కొలువు తీరిన పాలక వర్గం ప్లాస్టిక్ సమస్యను పట్టించుకునేనా..?అని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.ప్లాస్టిక్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించి ఏళ్ళు గడుస్తున్న,ముగ్గురు కమీషనర్లు, రెండు పాలక వర్గాలు మారిన, గత కమీషనర్ రమణచారి హయాంలో తప్ప ఎవ్వరు ప్లాస్టిక్ నియంత్రణ ను పట్టించుకొనే పాపాన పోలేదు.సిరిసిల్ల మున్సిపల్ శానిటేషన్ ఆటో, ట్రాక్టర్ల…
-

‘అతివలు’ ఆకాశంలో సగం.
మార్చి 10/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ‘అతివలు’ ఆకాశంలో సగమని, అవకాశామిస్తే అన్ని రంగాల్లో రానిస్తారని 15వ వార్డ్ కౌన్సిలర్ కూర భాగ్య లక్ష్మి అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలోని, అంబేద్కర్ నగర్ కమాన్ వద్ద వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలకు సత్కారం చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ, మహిళల్ని ప్రోత్సహించాలే గాని, వారు సాధించని విజయాలంటూ ఉండవు. అంతరిక్ష పరిశోధనలో…
-

మటన్ @900…సిరిసిల్ల లో మాత్రమే…?
మార్చి 09/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ధరలు ఏ అధికారి పెంచమన్నారో, ఎవరు పెంచతున్నారో తెలియదు కానీ సిరిసిల్ల లో మాత్రం మటన్ మాంసం కేజీ 900 అయ్యింది.తెలంగాణ ప్రభుత్వం 21 జనవరి 2021 న మటన్ ధర 700/-గా నిర్ణయించింది.కానీ అవేవి పట్టించుకోకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మటన్ షాప్ నిర్వహకులు మాత్రం మటన్ కేజీ ధరను అమాంతం 900/- చేసారు.గత…
-

శాంతియుత పద్ధతుల్లో న్యాయం అందించగలుగుతున్నాం.
• మౌలిక సదుపాయాలు, అవసరమైన మానవ వనరులు లేకపోతే,న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పనిచేయలేదు. * ప్రజల సమయం, శక్తి, డబ్బు అనవసరంగా కేసులతో వృథా కాకుండా చూడాలి. * మధ్యవర్తిత్వాన్ని మరింత అభివృద్ధి చేయాలి. * ప్రజలు అవసరమైనప్పుడు న్యాయం కోసం విశ్వాసంతో కోర్టులను ఆశ్రయించగలిగే వాతావరణం సృష్టించాలి. • రాష్ట్ర హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి అప్రెష్ కుమార్ సింగ్. మార్చి 07/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల…
-

ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం.
మార్చి 02/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ప్రాంతీయ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి,నాణ్యమైన సేవలు అందించడమే నవిష్క ఇన్ఫ్రా & సర్వీసెస్ లక్ష్యమని నిర్వాహకులు నూనె నగేష్ తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం,గొల్లపల్లి (వట్టిమల్ల)లో నగేష్ -మౌనిక ముద్దుల చిన్నారి 8వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని NAVISHKA INFRA & SERVICES PVT LTD సంస్థను ప్రారంభించనున్నారు .అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రాంతీయ యువతకు…
-

గస్తీ లేకనే ఘర్షణలు….?
మార్చి 01/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాత్రివేళ పోలీసుల సరైన గస్తీ లేకనే ఘర్షణలు చెలరేగుతున్నాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మొన్న అర్ధ రాత్రి బి. వై నగర్ శివారులో ఒక యువకుని పై 8మంది యువకులు దాడి చేయడం జిల్లా లో చర్చనియా అంశంమైంది. పట్టణ శివార్లలలో యువకులు గుంపులు గుంపులుగా ఉంటూ మద్యం, గంజాయి లాంటి…
-

పలు అభివృద్ధి కార్యక్రమాలకు 53 లక్షలు.
ఫిబ్రవరి 27/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ పట్టణ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు 53 లక్షలు కేటాయించింది.అన్నారు.శనివారం సిరిసిల్ల మున్సిపల్ లో చైర్పర్సన్ జిందం కళ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో కౌన్సిల్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు 53 లక్షలు మంజూరికి ఆమోదం తెలిపింది.విద్యానగర్, నెహ్రు నగర్ లోని వైకుంఠదామాలలో దహన సంస్కారాలను 101/-లకేనిర్వహించడానికి16.80లక్షలు,వార్డుల వారీగా స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ నిర్వహించడానికి…
-

పారిశుద్యం దారుణంగా ఉంది.
ఫిబ్రవరి 27/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మా 15వ వార్డ్ లో పారిశుద్యం దారుణంగా ఉందనీ అ వార్డ్ కౌన్సిలర్ కూర భూలక్ష్మి అన్నారు.శనివారం సిరిసిల్ల మున్సిపల్ లో జరిగిన సాధారణ సమావేశంలో కూర భాగ్య లక్ష్మి మాట్లాడుతూ, తన వార్డులో పారిశుద్ధ్యం సరిగా లేదని అన్నారు. వీధులు ఊడుచేవాళ్లు, డ్రైనేజీ శుభ్రం చేసే వాళ్ళు లేరని తెలిపారు.మా వార్డ్ ను ఆనుకొని ఉన్న…
-

పడితే… పరలోకమే…!
ఫిబ్రవరి 23/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్ లో సిరిసిల్ల మున్సిపల్ సిబ్బంది తవ్విన మంచినీటి గుంతలో పడితే పరలోకమే అన్నట్లుగా ఉంది. నీటి సమస్య ఉందనే కారణంతో మున్సిపల్ సిబ్బంది ఇలా తవ్వి పూడ్చకుండా వదిలేశారు. ఈ మధ్యకాలంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది గాని చరవాణిలో చెపితే తప్ప సమస్యల పట్ల స్పందించడం లేదని విమర్శలు…
-

ఆబాది భూమిని అమ్మేయబోతున్నారు.
ఫిబ్రవరి 19/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఆబాది భూమిని అమ్మేయబోతున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావు పేట మండలం,భీముని మల్లారెడ్డి పేట గ్రామస్థులు జిల్లా కలెక్టర్ కు గురువారం పిర్యాదు చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ,భీముని మల్లారెడ్డి పేట గ్రామం మధ్యలో గత 100ఏళ్ల నుండి 1ఎకరం ఆభాది భూమిని ఉన్నదని, దాన్ని గ్రామస్థులు గ్రామ పండగలు, వరి దాన్యానం కొనుగోలు,వివాహ కార్యక్రమాలు, సభలు, సమావేశాలు…
-

నన్ను ఏమైనా చేసుకోర్రి .
ఫిబ్రవరి 15/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ సంస్థలో నేడు జరుగుతున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బుర్ర నారాయణ అసహనం వ్యక్తం చేశారు.13వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైన బుర నారాయణ సీనియర్ కౌన్సిలర్ గా సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఆశించగా, నేడు ఆ పదవిని పద్మశాలి వర్గానికి చెందిన మరో వ్యక్తి కేటాయించడం తీవ్ర ఉధృతకు దారితీసింది. ఈ…
-

స్వామి భక్తికే సానుకూల మా(లం )….?
ఫిబ్రవరి 14/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ ‘చైర్ ‘ స్వామి భక్తికే సానుకూలం..! గా ఉన్నట్లు కీలక సమాచారం. ఛైర్పర్సన్ పదవికి 4 అభ్యర్థులు జిందం కళ, దార్నం అరుణ, మంచె రేణుక, గుండ్లపెల్లి నీరజ లు పోటీ పడగా, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరితో గంటల తరబడి చర్చలు జరిపినట్లు సమాచారం.ఎప్పటిలాగే ‘స్వామి భక్తే ‘ సఫలమైనట్లు…
-

ప్రతి అంగన్వాడి కేంద్రం సురక్షితం.
ఫిబ్రవరి 15/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి అంగన్వాడి కేంద్రం సురక్షితంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాయని జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మీరాజం తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డి పేట మండలం, వెంకటాపూర్ గ్రామంలో రెండవ అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఘాటన పై జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ, గాయపడిన బాలుడి ని మెడికో లీగల్ కేసు ప్రకారం ప్రభుత్వ…
-

ఛైర్మెన్ ‘చైర్’ దక్కెదేవరికో…..?
• స్వామి భక్తికా…సేవకులకా…? • భవిత్వం తెలనుంది ఈ నెల 16న…! ఫిబ్రవరి 14/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్లలో ఆద్యంతం ఆసక్తి కరంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి.ఇప్పుడు పట్టణంలో చర్చంతా చైర్మన్ ‘చైర్’ గురించే.ఎవరికి చైర్ ?ఎప్పటిలాగే స్వామి భక్తిని వరిస్తుందా…? లేదా సేవకులను గుర్తిస్తుందా…?BRS పార్టీ ఆవిర్భావo నుండి కాకున్నా , తెలంగాణ ఉద్యమం నుండి పార్టీ లో …
-

స్పందించిన అధికారులు.
ఫిబ్రవరి 13/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. బకెట్లో చాయ్…? శీర్షికన ‘నేటి భారతం’లో ప్రచురించిన వార్తకు అధికారులు స్పందించారు. మీడియా ప్రతినిధులకు అందించే టి ని ఫ్లాస్క్ లో తెచ్చి అందించారు.
-

బకెట్లో చాయ్…?
• ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేసిన విలేకరులు. • కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన. ఫిబ్రవరి 13/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్లలోని సినారె కళామందిర్ వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న సౌకర్యాల పట్ల విలేకరులు అసహన వ్యక్తం చేశారు. మున్సిపల్ వారు ఏర్పాటుచేసిన చాయ్, టిఫిన్ అన్ని నాసిరకంగా ఉన్నాయని అన్నారు. తాగే టి ని బకెట్…
-

ప్రజల తీర్పు శిరసవహిస్తాం.
ఫిబ్రవరి 12/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పును శిరసావహిస్తామని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం…
-

సిరిసిల్ల 18వ వార్డు లో ‘హస్త’గతమే.
ఫిబ్రవరి 10/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల 18వ వార్డు ‘హస్త’గతమవుతున్నట్లు కనిపిస్తోంది. విద్యావంతుల సంపూర్ణ మద్దతు అధికార పార్టీ వైపే ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థిని గెలుపు దిశగా నడిపించేట్టు ఓటర్లలో మార్పు కనిపిస్తోంది. బీఆర్ఎస్ తన అభ్యర్థిని ఎంపిక చేసిన విషయంలో నాటకీయ పరిణామాలు, సిట్టింగ్ కౌన్సిలర్ కు కేటాయించిన టికెట్ ను ఆఖరి నిమిషంలో రద్దు చేయడంతో ఆ పార్టీ…
-

విద్యార్థులు ఉన్నత లక్ష్యం తో చదువాలి
ఫిబ్రవరి 10/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ కమీషనర్ మంద మకరంద్ అన్నారు. తాను చదువుకున్న కాకతీయ E/M స్కూల్ లో పోలింగ్ బూత్ ఉన్నదని తెలిసి విజిటింగ్ చేసిన సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాకతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం గుగ్గిళ్ల జగన్ గౌడ్ ఘన స్వాగతం పలికారు.అనంతరం మకరంద్ స్కూల్ లోని SSC…
-

ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా గంగ మల్లయ్య.
ఫిబ్రవరి 6 /26 : నేటి భారతం. రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలోని శ్రీ శంభులింగేశ్వర ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా దర్శనం గంగా మల్లయ్య ఎన్నికైయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తాటికొండ శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా దర్శనం గంగ మల్లయ్య మాట్లాడుతూ.. తను ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించిన సభ్యులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్…
-

కేటీఆర్ కు చేదు అనుభవం.
ఫిబ్రవరి 6 /26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూరు బాబాజీ కాలనీ (09 వార్డు)లో ప్రజలు కేటీఆర్ ను ప్రశ్నించారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో మా కాలనిలో ఎలాంటి అభివృధి పనులు జరగలేదని, బీఆర్ఎస్ కౌన్సిలర్ పనులు చేయలేదని ఆవేదన వెళ్ళబోసుకున్నారు.మెడికల్ కాలేజీ కోసం మా భూములు…
-

మున్సిపల్ ఎన్నికల్లో వినూతన ప్రచారం.
ఫిబ్రవరి 6 /26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మున్సిపల్ ఎన్నికల్లో వినూతన ప్రచారం జరుగుతుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి వార్డ్ లోని ఓటర్ల ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తుంటారు. కానీ సిరిసిల్ల మున్సిపల్ 2వార్డు లో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి దుమాల శ్రీకాంత్, తన వార్డు పరిధిలోని ఓ మైదానంలో సుమారు 500 మంది మహిళలను సమీకరించి వారందరినీ తనదైన…
-

హుండీలలో షాకింగ్ లేఖలు..!
ఫిబ్రవరి 6 /26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మేడారం జాతర హుండీలలో షాకింగ్ లేఖలు లభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హుండీలలో ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటూ లేఖలు లభించాయని తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మలకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విన్నతి పత్రాలను కూడా హుండీలలో వేశారని, ఆస్తి తగాదాలు పరిష్కారం అవ్వాలని, భార్యాభర్తల పంచాయతీలు లేకుండా ఉండాలని, ఇలా రకరకాల విజ్ఞప్తులు అమ్మవారిని…
-

నియోజకవర్గస్థాయి సీఎం క్రీడా పోటీలు.
ఫిబ్రవరి 3 /26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఈ నెల 04 నుండి 06 వరకు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సీఎం క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎం ఈ ఓ దూస రఘుపతి తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీరన్నపల్లి, తంగళ్ళపల్లి, గంభీరావుపేట మండలాలు పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ క్రీడలు మినీ స్టేడియం రాజన్న సిరిసిల్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడల షెడ్యూల్…
-

BRS పార్టీ కి మాజీ వైస్ చైర్మన్ రాజీనామా.
ఫిబ్రవరి 3 /26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బండారి శ్యాం బిఆర్ఎస్ పార్టీకీ రాజీనామా చేశారు.సిరిసిల్ల మున్సిపల్ పదవ వార్డుకు బిఆర్ఎస్ టికెట్ ఆశించిన శ్యాం కు పార్టీ ఎన్నికల ఇంచార్జ్, జిల్లా అధ్యక్షులు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు.పార్టీ కోసం ఎల్లప్పుడూ నమ్మకంగా పని చేశానని, నమ్మక ద్రోహం చేశారంటూ శ్యాం ఆవేదన వ్యక్తం చేశారు.
-

కేటీఆర్ ఓటమిని ఒప్పుకున్నాడు.
జనవరి 31 /26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ తన ఓటమిని ఒప్పుకున్నాడని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కె. కె మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కె. కె మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రజా పాలన విశ్వసిస్తూ ప్రజలు గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 68% కాంగ్రెస్ పార్టీకి పట్టం…
-

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు.
జనవరి 31 /26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రోడ్లపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపొద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పి చంద్రయ్య అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి వి.లక్ష్మణ్ ఆధ్వర్యంలో భద్రత మాసోత్సవ ముగింపు కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వెయ్యి మంది విద్యార్థులతో సిరిసిల్ల బతుకమ్మ ఘాటు…
-

చెక్ పోస్ట్ ల వద్ద విస్తృత తనిఖీలు.
జనవరి 30/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల వద్ద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిరిసిల్ల పోలీస్, ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ ల వద్ద విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.ఈ సందర్బంగా ఎన్నికల అధికారులు మాట్లాడుతూ, తనిఖీలో 50వేల కంటే ఎక్కువ నగదు లభిస్తే ఎన్నికల నియమవాళికి లోబడి సీజ్ చేయబడునని వాహన దారులు…
-

ట్రాఫిక్ నియంత్రణ పట్ల ప్రతి పౌరుడు బాధ్యత కలిగి ఉండాలి.
http://youtube.com/post/Ugkxfe5gmB0kiBqW6K22gaA0VXjRLi2Ab7yi?si=w-ddtVDujgAjpBKE
-

ట్రాఫిక్ నియంత్రణ పట్ల ప్రతి పౌరుడు బాధ్యత కలిగి ఉండాలి.
జనవరి 24/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియంత్రణ పట్ల అవగాహన కలిగి ఉంటే గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవచ్చని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే. అన్నారు.శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సిరిసిల్ల పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అలైవ్ – అరైవ్ రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ,ప్రతి పౌరుడు…