ఏప్రిల్ 12/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
ఈరోజు వెలువడిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్ష ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల పట్టణానికి చెందిన గుంటుక శృతి స్టేట్ రెండవ ర్యాంక్ సాధించింది. తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గురుకుల కళాశాలలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్న శృతి తండ్రి నేత కార్మికుడు, తల్లి పాఠశాలలో స్వీపర్.ఎంపీసీ రెండవ సంవత్సరంలో 992 మార్కు సాధించి, ఎంపీసీ విభాగంలో స్టేట్ రెండో స్థానంలో నిలిచింది. శృతి సాధించిన ర్యాంకు పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము పడ్డ కష్టానికి తమ కూతురు ఫలితం దక్కించినట్లు అయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేరెళ్ల గురుకుల కళాశాల ప్రిన్సిపల్, లెక్చలర్లు శృతి అభినందించారు.










Leave a Reply