పడితే… పరలోకమే…!

Published by

on

పెద్ద బజార్ లో  మున్సిపల్   తవ్వినా గుంత.

ఫిబ్రవరి 23/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్ లో సిరిసిల్ల మున్సిపల్ సిబ్బంది తవ్విన మంచినీటి గుంతలో పడితే పరలోకమే అన్నట్లుగా ఉంది. నీటి సమస్య ఉందనే కారణంతో మున్సిపల్ సిబ్బంది ఇలా తవ్వి పూడ్చకుండా వదిలేశారు. ఈ మధ్యకాలంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది గాని చరవాణిలో చెపితే తప్ప సమస్యల పట్ల స్పందించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు, సిబ్బంది వారి విధులు వారు నిర్వర్తించుకోవడానికి ప్రజలు చరవాణి ద్వారా చెప్పాల్సిన అవసరమేంటని ప్రజా సంఘాల ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో తవ్విన గుంతను  పుడ్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

February 2026
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
232425262728  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading