Month: January 2026
-

కేటీఆర్ ఓటమిని ఒప్పుకున్నాడు.
జనవరి 31 /26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ తన ఓటమిని ఒప్పుకున్నాడని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కె. కె మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కె. కె మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రజా పాలన విశ్వసిస్తూ ప్రజలు గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 68% కాంగ్రెస్ పార్టీకి పట్టం…
-

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు.
జనవరి 31 /26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రోడ్లపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపొద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పి చంద్రయ్య అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి వి.లక్ష్మణ్ ఆధ్వర్యంలో భద్రత మాసోత్సవ ముగింపు కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వెయ్యి మంది విద్యార్థులతో సిరిసిల్ల బతుకమ్మ ఘాటు…
-

చెక్ పోస్ట్ ల వద్ద విస్తృత తనిఖీలు.
జనవరి 30/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల వద్ద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిరిసిల్ల పోలీస్, ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ ల వద్ద విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.ఈ సందర్బంగా ఎన్నికల అధికారులు మాట్లాడుతూ, తనిఖీలో 50వేల కంటే ఎక్కువ నగదు లభిస్తే ఎన్నికల నియమవాళికి లోబడి సీజ్ చేయబడునని వాహన దారులు…
-

ట్రాఫిక్ నియంత్రణ పట్ల ప్రతి పౌరుడు బాధ్యత కలిగి ఉండాలి.
http://youtube.com/post/Ugkxfe5gmB0kiBqW6K22gaA0VXjRLi2Ab7yi?si=w-ddtVDujgAjpBKE
-

ట్రాఫిక్ నియంత్రణ పట్ల ప్రతి పౌరుడు బాధ్యత కలిగి ఉండాలి.
జనవరి 24/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియంత్రణ పట్ల అవగాహన కలిగి ఉంటే గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవచ్చని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే. అన్నారు.శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సిరిసిల్ల పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అలైవ్ – అరైవ్ రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ,ప్రతి పౌరుడు…
-

కర్ర విరగదు.. పాము చావదు…?
• ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు ఎన్నాళ్లు? • MP బండి సంజయ్. జనవరి 21/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో ఇంకెన్నాళ్లు డ్రామాలు సాగుతాయని ఆయన ప్రశ్నించారు. కర్ర విరగదు.. పాము చావదు అన్న చందంగా ఈ కేసు నడుస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్…
-

ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు.
జనవరి 21/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. పెండింగ్ చలాన్లు చెల్లించాలంటూ వాహనదారులను బలవంతపెట్టొద్దని తెలంగాణ హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వాహనం కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయొద్దన్న హైకోర్టు పేర్కొంది.స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చని తెలిపింది.
-

రేపు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన.
జనవరి 20/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి రాష్ట్ర వ్యవసాయ,సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ తెలిపారు.సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల మున్సిపాలిటీ ద్వారా…
-

ఆలస్యంగా వచ్చిన అనుమతి.
జనవరి 20/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఊరట కల్పించింది. ఈసారి కూడా పరీక్షా కేంద్రానికి 5 నిమిషాల వరకు ఆలస్యం గా వచ్చిన విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించాలని నిర్ణయించింది. గతేడాది అమలు చేసిన ఈ నిబంధననే ఈసారి కూడా కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది.రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్…
-

‘అందుకే” BRS టికెట్ కు డిమాండ్.
జనవరి 17/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. BRS పార్టీ అధికారంలో లేకున్నా పార్టీ టికెట్ కు పోటీ పెరిగిందని,ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నదని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యoలో, రాజకీయ విశ్లేషకులు మాత్రం, BRS పార్టీ టికెట్ లభించిన అభ్యర్థులందరికి, పార్టీ ఫండ్ కింద భారీ మొత్తం ఇస్తుందని, అందుకే ఇంతగా BRS టికెట్ కు డిమాండ్ పెరిగిందని అభిప్రాయపడుతున్నారు.మొన్న జరిగిన…
-

సమయం పొడగించి…తప్పులు సరిచేయండి.
జనవరి 06/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్ రూపొందించిన ఓటర్ల జాబితలో తప్పులు ఉన్నాయని, తప్పులను సరిచేయడానికి సమయం పొడగించి సరి చేయాలనీ మాల మహానాడు జాతీయ నాయకుడు రాగుల రాములు అన్నారు.సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాములు మాట్లాడుతూ,సిరిసిల్ల మున్సిపల్ అధికారులు రూపొందించిన ఓటర్ల జాబితాలో పేర్లు, తల్లిదండ్రుల పేర్లు,…
-

ఉనికి చాటుకోవడానికే జాగృతి జనం బాట.
జనవరి 05/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. తన ఉనికి చాటుకోవడానికే తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితక్క జనం బాట పట్టారని తెలంగాణ జాగృతి బాధితుల ఐక్యవేదిక భాద్యులు అన్నారు.సోమవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ,కవితక్క! తన కోసం పాటుపడిన కార్యకర్తలను గడిచిన 10ఏళ్ల లో ఏనాడు పట్టించుకోలేదన్నారు.BRS పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను…