• అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతే కఠిన చర్యలు తప్పవు.
•జిల్లా వ్యాప్తంగా పట్టుబడ్డ 256 మంది యువకులు.
•81 ద్విచక్ర వాహనాలు సీజ్.
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి.
అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతూ,అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్న యువతే లక్ష్యంగా ‘ఆపరేషన్ చబుత్రా’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పి అఖిల్ మహజన్ అన్నారు.’ఆపరేషన్ చబుత్రా’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పి మాట్లాడుతూ,అసాంఘిక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని, ముఖ్యంగా యువకులు తమ భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు.టీనేజీలో యువత చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉందని, తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇకనుండి జిల్లాలో తరచుగా ‘ఆపరేషన్ చబుత్రా’ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవరైనా యువకులు రోడ్లపై అనవసరంగా గుంపులుగా సంచరిస్తూ సామాన్య ప్రజానీకానికి, మహిళల ను ఇబ్బందుల కు, అభద్రత భావానికి గురి చేస్తే, వారిపై టౌన్ న్యూసెన్స్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.శనివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా యువకులు అర్ధరాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్లు, ఫుట్పాత్లపై గుంపులుగా, జులాయిగా తిరుగుతూ, మద్యం సేవించి రోడ్లపై ద్విచక్ర వాహనాలతో రాష్ డ్రైవింగ్ చేస్తూ, హారన్లు కొడుతూ, ప్రధాన కూడళ్ల లలో వాహనాలను నిలిపి, అనుమానస్పదంగా తిరుగుతున్న *256* మంది యువకులను అదుపులోకి తీసుకోని 81 బైక్స్ లను సీజ్ చేసి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పి వివరించారు.
Leave a comment