
సెప్టెంబర్15/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
అట్టి మట్టికి ఐదు లక్షలట…..? అంటూ సిరిసిల్ల మున్సిపల్ అధికారుల, పాలకవర్గం తీరుపై పట్టణ ప్రజలు అసహన వ్యక్తం చేస్తున్నారు.గతవారం సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం , గణపతి, బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాలకు చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు 25 లక్షలు కేటాయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చడానికి పట్టణంలోని పలు వార్డుల్లో స్టోన్ డస్ట్, గ్రావెల్ పోస్తున్నారు. ఈ స్టోన్ డస్ట్ వర్షం పడితే కొట్టుపోతుందని తెలిసి మున్సిపల్ అధికారులు పాలకవర్గం ప్రజాధనం ఇలా వృధా చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపకుండా, ఇలా ప్రజాదానాన్ని ప్రతి ఏడు ఖర్చు చేస్తున్నారని, మునిసిపల్ సంస్థ కు కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమo పై లేదని ప్రజలు అగ్రహ వ్యక్తం చేస్తున్నారు.










Leave a Reply