



ఆగస్టు 18/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
సిరిసిల్ల, అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులు, అల్పాహారం మధ్యాహ్న భోజనం చేయడానికి వెళ్లే మార్గంలో, సిరిసిల్ల మున్సిపల్ సిబ్బంది కొట్టి పడేసిన చెట్టు విద్యార్థుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తున్నది. సిరిసిల్ల అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఓ చెట్టు ప్రమాదకరంగా మారిందని, సిరిసిల్ల మున్సిపల్ అధికారులకు, స్థానిక కౌన్సిలర్ కు విషయాన్ని తెలపగా, వారు స్పందించి, ప్రమాదకరంగా మారిన చెట్టును నరికించడం, ఆ చెట్టు కొమ్మలను తీసుకెళ్లడమూ జరిగింది. కానీ వినియోగ యోగ్యంలేని ఈ చెట్టు కాండాన్ని ఇలా వదిలేయడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపిన ఎవరు స్పందించడం లేదని తెలుస్తోంది. ఇకనైనా సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని విద్యార్థులు కోరుతున్నారు.











Leave a Reply