ఆగస్టు 25/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో, వివిధ అవసరాల కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజలకు పార్కింగ్ వసతి లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం సెల్లార్లో చైర్ పర్సన్, కమిషనర్, ఏఈ, డిఈ,టౌన్ ప్లానింగ్ ల కార్ల పార్కింగ్ తోనే సెల్లార్ నిండిపోతుందని, కార్యాలయానికి వచ్చే ప్రజల వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి స్థలమే లేకుండా పోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా కమిషనర్ ప్రజలకు పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.











Leave a Reply