
నేటి భారతం(ప్రశ్నించడం పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
మైనర్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రాఫిక్ ఎస్ ఐ రమేష్ తెలిపారు. మంగళ వారం సిరిసిల్ల గాంధీచౌక్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ, జిల్లాలో మైనర్ డ్రైవింగ్ రోజురోజుకు పెరిగిపోతుందని, తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని తెలిపారు. ఎవరైనా మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, కఠిన చర్యలు తప్పవని సూచించారు. మైనర్లు నడిపిన ఆ వాహనాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు లోబడి నెంబర్ ప్లేట్, సైలెన్సర్, లైసెన్స్ తదితరాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వద్దని కోరారు.











Leave a Reply