• ఈ నెల 15న లాటరీ పద్ధతిన విద్యార్థుల ఎంపిక.
• జిల్లాపెడ్యుల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజన్న సిరిసిల్ల.
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
బెస్ట్ అవైలేబుల్ స్కూల్ లలో ప్రవేశాలకు ఎంపిక జరుగనున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా పెడ్యుల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. టెస్ట్ అవైలేబుల్ స్కూల్స్ నందు 1వ తరగతి (నాన్ రెసిడెన్షియల్) లో ప్రవేశాలకు ఈ నెల 15 ఉదయం 11.00 గంటలకు లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగనున్నట్లు తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించిన 1వ తరగతి (నాన్ రెసిడెన్షియల్ నందు 46) సీట్లను కేటాయించారు.దరఖాస్తు చేసుకున్న సంబందిత విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు సకాలంలో హాజరు కావాలని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.











Leave a Reply