‘నేటి భారతం’ (ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 05, 2024.
ఎలాగూ విద్యాసంవత్సరం అంత క్లాస్ లు, హోమ్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్, అంటూ విద్యార్థులకు విరామం లేకుండా విద్యాబోధన జరుగుతూనే ఉంది కదా? మరి ఈ పండగపూట పాఠాలెంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.జిల్లా కేంద్రం లో ని పలు ప్రైవేట్ పాఠశాలలు వారి విద్య సంస్థలకు పేరు రావడానికి ఇదిగో ఇలా బడి పిల్లలను పండగ పూట కూడా ప్రశాంతంగా, ఆనందంగా ఉండనివ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.రాజన్న సిరిసిల్ల జిల్లా డీఈఓ గారు.! పండగపూట ప్రైవేట్ క్లాసులెందండి.?
మీ దృష్టి కి వస్తేనే స్పందిస్తారా…?పిర్యాదు అందితేనే చర్యలు చెప్పడతారా…? ప్రభుత్వం మీకు కేటాయించిన ఏ. సి వాహనం ఇలాటి చర్యలు జరగకుండా పర్యవేక్షించడానికి కాదా…? అని ప్రజలు విద్యార్ధి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇకనైనా పండగ పూట ప్రైవేట్ క్లాస్ లు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.











Leave a Reply