“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 08, 2024.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ వద్ద, బతుకమ్మ ఘాట్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఆఫీసియల్స్ & ప్రొఫెషనల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.ఈ టోర్ని లో పోలీస్, లాయర్స్, ప్రెస్, కెవి స్కూల్, బిజీసీసీ టీమ్స్ పాల్గొన్నాయి. సోమవారం రోజున జరిగిన లీగ్స్ మ్యాచ్ లలో పోలీస్ టీం, లాయర్స్ టీం ఫైనల్ కి చేరాయి.మంగళవారం రోజున జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పోలీస్ టీం లాయర్స్ టీం పైన విజయం సాధించింది. విజేతలకు బిఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో నిర్వహకులు కొండికొప్పుల రవి, దూస మధు, పారిపెల్లి రవికుమార్, జంగిటి మధు, సుమన్, రాజు బతుకమ్మ ఘాట్ క్రికెట్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.











Leave a Reply