

• రోడ్డు పై వడ్లు పొయ్యడం వల్లే ఈ ప్రమాదం అంటున్న ప్రజలు.
• రోడ్డు పై వడ్లు పోయద్దన పట్టించుకోని రైతులు.
• బోనాల వద్ద జరిన రోడ్డు ప్రమాదం జరగక ముందే జిల్లా కేంద్రంలో మరో ఘటన.
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 23, 2024.
పాలకుల పట్టింపు లేని తనం, ప్రజల బాధ్యత రహితత్యం వెరసి ఒ కుటుంబంతో ప్రయాణిస్తున్న కారు కల్వర్ట్ లో పడిపోయింది.వివరాల్లోకేళితే నిజాం పేట కు చెందిన ఒ కుటుంబం వేములవాడలో పెళ్లి చూపులకు బయలు దేరింది. సిరిసిల్ల చంద్రంపేట దాటి రగుడు పాఠశాల వద్దకు రాగానే రైతులు రోడ్డు పై వరి ధాన్యం ఆరబోయడంతో ఒ రూట్ ని బ్లాక్ చేయడం వల్ల సింగిల్ రోడ్డు కావడం తో రూట్ మార్చుకొని ఎదురుగా వస్తున్న కారు ను చంద్రం పేట దాటి వస్తున్న కారు ఢీ కొట్టి కల్వర్ట్ లో పడటం తో కుటుంబంలోని వారందరికీ తీవ్ర గాయలైన్నాయి. స్థానికుల సహకారం తో క్షత్తగాత్రులను కారు నుండి బయటికి తీసి, జిల్లా ఆసుపత్రి కి తరలించారు.రోడ్డు పై వరి ధన్యనం అరబోయడమే కాకుండా కల్వర్ట్ నిర్మాణంలో ఉంది టేక్ డైవర్షన్ అని బోర్డ్ ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా పాలకులు వరి దాన్యం ఆరాబోసుకోవడానికి కల్లాలు ఏర్పాటు చేయాలనీ రైతులు కోరుతున్నారు.











Leave a Reply