ఫిబ్రవరి 3 /26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
ఈ నెల 04 నుండి 06 వరకు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సీఎం క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎం ఈ ఓ దూస రఘుపతి తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీరన్నపల్లి, తంగళ్ళపల్లి, గంభీరావుపేట మండలాలు పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ క్రీడలు మినీ స్టేడియం రాజన్న సిరిసిల్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడల షెడ్యూల్ ఈ విధంగా
04.02.2026 బుధవారం రోజున
* వాలీబాల్ బాలబాలికలకు ( 18 సంవత్సరాల లోపు).
* kho kho బాలబాలికలకు (18 సంవత్సరాల లోపు).
* హ్యాండ్ బాల్ (బాల బాలికలకు)
*బాస్కెట్ బాల్ (బాల బాలికలకు)
*స్విమ్మింగ్
05.02.2026 గురువారం రోజున.
* కబడ్డీ (మహిళలు, పురుషులకు).
* అథ్లెటిక్స్ (మహిళలు, పురుషులకు అన్ని కేటగిరీలకు).
* బ్యాడ్మింటన్ ( బాలురులు, బాలికలకు అన్ని కేటగిరీలకు).
* బేస్ బాల్ ( మహిళలు, పురుషులకు).
* సైక్లింగ్
06.02.2026 శుక్రవారం రోజున.
* చెస్, క్యారమ్స్, యోగాసన
*wushu, కరాటే, రెజ్లింగ్, కిక్ బాక్సింగ్, బాక్సింగ్, జూడో
* ఫుట్బాల్, నెట్ బాల్
మండల స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గస్థాయికి ఎంపిక కాబడిన క్రీడాకారిణి, క్రీడాకారులు వారి ఆధార్ కార్డతో పాటు రిజిస్ట్రేషన్ ఐడి ప్రూఫ్ కూడా తీసుకొని గేమ్స్ లో పాల్గొనాలని ఎం ఈ ఓ తెలిపారు.











Leave a Reply