డిసెంబర్ 15/25 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ ప్రాంతంలోని వ్యవసాయదారుల (తుంగపట పోచమ్మ రైతు సంఘం ) నూతన రైతు సంఘం కార్యవర్గం ఎన్నిక జరిగింది.మిడ్ మానేరు కట్ట కింది భాగంలో ఉన్న వ్యవసాయ భూములను సాగు చేస్తున్న రైతులు సోమవారం రైతు సంఘం ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికల్లో అధ్యక్షుడుగా సిరిగిరి వెంకటేశ్,ఉపాధ్యక్షులుగా బిజ్జిగ క్రిష్టయ్య, నక్క నర్సయ్య, నెల్లుట్ల శేఖర్,సెక్రటరీ గా పంపరి అర్జున్, జాయింట్ సెక్రటరీ పెరుమాండ్ల శేఖర్, దుమాల రంజిత్,కాసర్ల బాలయ్య కోశాధికారి మెట్ట రామస్వామి, గౌరవఅధ్యక్షులు ఆకునూరి బాలరాజు,సలహా దారులు గా అన్నారపు కనకయ్య,పాటి కిరణ్ కుమార్,సిరిగిరి రఘుపతి తదితరులు ఎన్నికయ్యారు.











Leave a Reply