కంచు కోటలు బద్దలవుతున్నాయి….?

Published by

on

డిసెంబర్ 20/25 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

కల్లోల ప్రాంతాలైన కోనరావుపేట, ఎల్లారెడ్డి పేట, వీరన్నపల్లి, చందుర్తి మండలాలల్లో కంచుకోటలు బద్ధలవుతున్నాయి.ఆయుధాన్ని చేతిన పట్టి అన్నలు దొరలను తరిమితే,ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్య పద్ధతిలో  దొరల కంచుకోటలను బద్దలు కొట్టారు నేటి యువత.మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కోనరావుపేట మండలంలోని నాగారం, మల్కాపేటలో  దొరలను, దొర మద్దతును కాదని బి.సిలను గెలిపించి బి.సి లకు సర్పంచ్ పదవితో పట్టం కట్టారు.ఎల్లారెడ్డి పేట, వీరన్న పల్లి,చందుర్తి మండలాలల్లో జనరల్ స్థానాలల్లో ఆధిపథ్య కులాలకు పోటీగా నిలుచుని బి.సి56, ఎస్సి4, ఎస్టీ7 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నారు. నిన్న, మొన్నటి దాక దొర ఆదేశించాడనో, పటేల్ చెప్పాడనో ఓట్లు వేసే ఎస్సి, ఎస్టీ, బి.సి వర్గాల ప్రజలు, స్వతంత్రంగా ఆలోచించగలరని, ప్రభుత్వాలను నడిపే సమర్థ్య వారిలో కూడా ఉందని ఓట్ల తో తెలియజేసారు.ఏది ఏమైనా  సమాజంలో మార్పుకు ఇది మరో అడుగని, రానున్న ఎన్నికలు ఆధిపథ్య కులాలకు పలు సవాళ్ళను విసురుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Leave a Reply

December 2025
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading